ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 4, 2021, 12:38 PM IST

ETV Bharat / state

రోకలిబండతో భర్త దాడి.. చికిత్స పొందుతూ భార్య మృతి

పదహారేళ్ల అనోన్య వైవాహిక జీవితాన్ని మరిచి భార్యను కడతేర్చాడు ఓ భర్త. ఆదమరచి నిద్రిస్తున్న ఆమెపై రోకలిబండతో నిర్ధాక్షిణ్యంగా దాడి చేశాడు. తీవ్రగాయాలపాలైన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. మృతి చెందింది.

Husband attak on his wife
భార్యపై రోకలిబండతో దాడి చేసిన భర్త

అనుమానంతో భార్యపై రోకలిబండతో దాడి చేశాడు ఓ భర్త. తీవ్రంగా గాయపడిన ఆమె, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన పలిమినేని సత్యనారాయణరెడ్డి బేల్‌దారు మేస్త్రీగా పని చేస్తున్నాడు. ఇతనికి 16 ఏళ్ల క్రితం దివ్యతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. కొంతకాలంగా వీరిద్దరి మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. ఆమె నిద్రిస్తుండగా రోకలిబండతో దాడి చేశాడు.

తలకు తీవ్రగాయాలైన ఆమెను కుటుంబ సభ్యులు తొలుత స్థానిక ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం జీజీహెచ్​కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ అశోక్‌కుమార్‌ తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకోవటానికి ప్రత్యేక పోలీసు బృందాన్ని నియమించినట్లు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details