ఆంధ్రప్రదేశ్

andhra pradesh

హోంమంత్రికి నిరసన సెగ... ఆందోళనకారులపై అమాత్యుల ఆగ్రహం

By

Published : Jan 3, 2021, 10:48 PM IST

హోంమంత్రి మేకతోటి సుచరితకు సొంత నియోజకవర్గంలో నిరసన సెగ తగిలింది. ఇళ్ల పట్టాల పంపిణీలో అవకతవకలు జరిగాయంటూ మహళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Home Minister Mekatoti Sucharita protesting against the distribution of house documents in guntur district
హోంమంత్రికి నిరసన సెగ... ఆందోళనకారులపై అమాత్యుల ఆగ్రహం

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం గనికపూడిలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హోం మంత్రి మేకతోటి సుచరిత హాజరయ్యారు. ఈ క్రమంలో ప్రభుత్వ తీరుపై లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేశారు. ఇళ్ల పట్టాల పంపిణీలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. అర్హులైన తమకు కాదని అనర్హులైన వారికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో ఆందోళన చేస్తున్న మహిళలపై హోంమంత్రి సుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు.. జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు.

హోంమంత్రికి నిరసన సెగ... ఆందోళనకారులపై అమాత్యుల ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details