గుంటూరు జిల్లా నరసరావుపేటలో ప్రియుళ్ల మోజులో పడి కన్నతల్లి కర్కశత్వానికి గురైన ఇద్దరు పిల్లలకు ఇంకా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. కోర్టు ఆదేశాలు ఉన్నా తమను ఇంటి నుంచి బయటకు గెంటి వేయటంతో... అచ్చిరెడ్డి కాంప్లెక్స్ సమీపంలో అమ్మమ్మతో పాటు రోడ్డుపై బైఠాయించి న్యాయం చేయాలని చిన్నారులు వేడుకుంటున్నారు. తమ ఇంటిని కొనుగోలు చేశామంటూ గుంటూరుకు చెందిన తహశీల్దార్ శ్రీకాంత్, అతని మామ చుక్కా సాంబయ్య లు దౌర్జన్యం చేస్తున్నారని చిన్నారుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొడుకులను రోడ్డున పడేసిన తల్లి.. ఎందుకంటే..!
వివాహేతర సంబంధం కోసం కడుపున పుట్టిన పిల్లలను చిత్రహింసలు పెడుతోంది ఆ తల్లి...చివరికి వారిని కట్టుబట్టలతో ఇంట్లో నుంచి బయటకు గెంటేసింది. గుంటూరు జిల్లాలో ఈ అమానుష ఘటన జరిగింది.
ఆవేదన వ్యక్తం చేస్తున్న చిన్నారులు
Last Updated : Mar 4, 2020, 5:17 PM IST
TAGGED:
latest news of guntru dst