ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పిల్లల్ని హతమార్చి.. తండ్రి మృతి - two sons

కన్నతండ్రే కసాయిగా మారి.. పసికందులను రాక్షసంగా గొంతుకోసి చంపాడు. భార్యపై ఉన్న కోపంతో కన్నబిడ్డల్నే కిరాతకంగా హతమార్చి... తానూ బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ఘటనా స్థలంలో స్థానికులు..అంతర చిత్రంలో చిన్నారులు

By

Published : Mar 7, 2019, 12:52 PM IST

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక గౌడ కల్యాణ మండపం వీధిలో ఓ తండ్రి తన పిల్లల గొంతుకోసి చంపాడు. ఆపై తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా.. గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది.

తాడేపల్లికి చెందిన రమణమూర్తి(35) చిలకలూరిపేటలో నివాసం ఉంటున్నాడు. లక్ష్మిని ప్రేమ వివాహం చేసుకున్న రమణమూర్తి.. కొంతకాలంగా అత్తింటివారితో ఆస్తి విషయంలో గొడవ పడుతున్నాడు. దీనికి తోడు మద్యానికి బానిసై భార్యను వేధిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం భార్యాభర్తలిద్దరికీ గొడవ జరగ్గా.. ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో నిన్న రాత్రి ఫూటుగా తాగొచ్చిన రమణమూర్తి మద్యం మత్తులో పిల్లలు భవాని నాగదినేశ్‌(8), సాయి(6)ని గొంతుకోసి చంపాడు. ఆపై అతడు ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపైకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చిన్నారులను చిదిమేసిన తండ్రి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details