ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మట్టి అక్రమ తవ్వకాలను అడ్డుకున్న అధికారులు

By

Published : Jun 21, 2020, 3:14 PM IST

గుంటూరు జిల్లా ఉండవల్లిలో జోరుగా సాగుతున్న మట్టి అక్రమ తవ్వకాలను రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారలు హెచ్చరించారు.

అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్న అధికారులు
అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్న అధికారులు


గుంటూరు జిల్లా ఉండవల్లిలో మట్టి అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. కొంత మంది వ్యక్తులు గుంటూరు ఛానల్ పక్కనే నల్లమట్టిని జేసీబీ ద్వారా తవ్వి సొంత పనులకు వాడుకుంటున్నారు. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు మట్టి తవ్వకాలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో మట్టి తవ్వకందారులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం అధికారుల హెచ్చరికలు చేయటంతో తవ్వకాలను నిలిపివేశారు.

ఇదీ చూడండి:పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details