ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 20, 2020, 8:01 AM IST

ETV Bharat / state

సాంకేతికతను వినియోగించుకోవాలి: డీజీపీ గౌతమ్ సవాంగ్

జిల్లా ఎస్పీలకు నూతన ట్యాబ్​లను డీజీపీ అందజేశారు. మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు.

dgp gives new tabs to police
డీజీపీ గౌతమ్ సవాంగ్

క్షేత్ర స్థాయిలో పోలీసులు మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ సూచించారు. జిల్లా ఎస్పీలకు నూతన ట్యాబ్​లను అందజేశారు. ఈ ట్యాబ్​లో ప్రస్తుతం వినియోగించే.. పోలీస్ యాప్​లతో పాటు అదనంగా మరికొన్ని వివరాలను పొందిపరిచినట్లు అధికారులు వెల్లడించారు. సీసీటీఎన్ఎస్, ఐసీజెఎస్, ఎల్​హెచ్ఎంఎస్, పీఐఎన్ఎస్, ఫింగర్ ప్రింట్స్, ఫోరెన్సిక్ వివరాలను ట్యాబ్​లో నిక్షిప్తం చేసినట్లు వివరించారు. జిల్లాల నుంచి కేసుకు సంబంధించిన వివరాలను.. అధికారులు ఆన్​లైన్​లో తెలుసుకోవచ్చునని డీజీపీ తెలిపారు. తొలివిడతగా 10 మందికి ఇవ్వగా.. మిగిలిన వారికి త్వరలోనే అందించనున్నట్లు తెలిపారు. నేరస్తులకు సంబంధించిన డేాటుకు ట్యాబ్ అనుసంధానం చేసి ఉంటుందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details