ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా భయం.. అంత్యక్రియలను అడ్డుకున్న స్థానికులు

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఓ మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు స్థానికులు అడ్డుపడ్డారు. కరోనా పరీక్షలు చేసిన అనంతరం క్రతువు జరిపించాలని తెలిపారు. విషయాన్ని బాధిత కుటుంబీకులు అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. వారు కూడా అదే సమాధానం చెప్పడం వల్ల ఇంటి వద్దే మృతదేహాన్ని ఉంచారు.

By

Published : Jun 29, 2020, 11:15 AM IST

cremation stopped by locals due to corona doubt in sattenapalli
అంత్యక్రియలకు అడ్డుపడ్డ స్థానికులు,, ఇంటి వద్దే ఉన్న మృతదేహం

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఓ వృద్ధురాలి మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు స్థానికులు అడ్డు తగిలారు. సత్తెనపల్లి నాగన్నకుంటకు చెందిన వృద్ధురాలు అనారోగ్యంతో గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. మృతదేహాన్ని కరోనా పరీక్షల అనంతరం బంధువులకు అప్పగించారు. వారు మృతదేహాన్ని ఖననం చేసేందుకు ఏర్పాటు చేయగా... స్థానికులు అభ్యంతరం తెలిపారు.

కరోనా నివేదిక వచ్చాకే అంత్యక్రియలు ప్రారంభించాలన్నారు. గుంత కూడ తవ్వనివ్వలేదు. చేసేదేమీలేక కుటుంబ సభ్యులు పోలీసులు, అధికారులకు సమాచారం అందించారు. వారు సైతం నివేదిక వచ్చిన తర్వాతే అంత్యక్రియలు చెయ్యాలని చెప్పారు. ఈ క్రమంలో వృద్ధురాలి మృతదేహాన్ని ఇంటి వద్దే ఉంచారు.

ABOUT THE AUTHOR

...view details