ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మేడికొండూరు మండలంలో పెరుగుతున్న కరోనా కేసులు

గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం మేడికొండూరు మండలంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. సోమవారం రెండు కేసులు నమోదయ్యాయి.మండలంలో ఇప్పటివరకూ ముగ్గురు కరోనాబారిన పడ్డారు. మేడికొండూరు ఎస్ఐ కరోనా పాజిటివ్ రావటంతో సిబ్బందికి పరీక్షలు చేస్తున్నారు.

By

Published : Jun 23, 2020, 3:39 PM IST

corona cases in medikonduru mandal are increasing at guntur dst
corona cases in medikonduru mandal are increasing at guntur dst

గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం మేడికొండూరు మండలంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మూడుకు చేరాయి. సిరిపురానికి చెందిన యువకుడు వృతి రీత్యా హైదరాబాద్​లో ఉంటున్నాడు. ఈ నెల 16న రైలు మార్గంలో సొంతూరికి వచ్చాడు. అతని నమూనాలు పరీక్షించిన వైద్యులు కరోనా పాజిటివ్ ఉన్నట్లు గుర్తించారు.

గ్రామంలో 200 మీటర్లు కంటైన్మెంట్ జోన్ మరో 200 మీటర్లు బఫర్ జోన్​గా ప్రకటించారు. ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. మేడికొండూరు పోలీస్​స్టేషన్లో ఎస్ఐకి కరోనా పాజిటివ్ వచ్చింది.సిబ్బందికి పరీక్షలు చేయనున్నారు.

ఇదీ చూడండి:నాపై కోపంతో... నా సన్నిహితులను ఇబ్బందిపెడతారా..?: గంటా

ABOUT THE AUTHOR

...view details