ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పల్లె పోరు: ఇరువర్గాల మధ్య తోపులాట.. పోలీసుల లాఠీఛార్జ్

By

Published : Feb 21, 2021, 1:15 PM IST

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండల పరిధిలోని ఫణిధం గ్రామంలో పోలీసులు లాఠీఛార్జి చేశారు. వైకాపా-తెదేపా వర్గీయుల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.

ycp tdp fight
ap panchayat polls 2021

పల్లె పోరు: ఇరువర్గాల మధ్య తోపులాట.. పోలీసుల లాఠీఛార్జ్

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం ఫణిధం గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. వైకాపా నాయకులు దొంగ ఓట్లు వేస్తున్నారని ఆరోపిస్తూ తెదేపాకు చెందిన పలువురు పోలింగ్ సెంటర్​లోకి దూసుకెళ్లారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అక్కడే ఉన్న పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీచార్జితో ఇరువర్గాలను చెదరగొట్టారు. పోలింగ్ కేంద్రం నుంచి పంపించటంతో వివాదం సద్దుమణిగింది.

ABOUT THE AUTHOR

...view details