ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అధికార లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు నిర్వహించండి'

ప్రభుత్వ లాంఛనాలతో మాజీ సభాపతి కోడెల అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. కాగా...అధికారిక లాంఛనాలు అవసరం లేదని కోడెల కుటుంబసభ్యులు తేల్చి చెప్పారు.

By

Published : Sep 18, 2019, 7:08 AM IST

'అధికార లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు నిర్వహించండి'

మాజీ శాసనసభాపతి కోడెల శివప్రసాద్ భౌతిక కాయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. ఆ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యాన్ని ఆదేశించినట్లు సీఎం కార్యాలయం తెలిపింది.
అధికారిక లాంఛనాలు అవసరం లేదు
ఇదిలా ఉండగా... అధికారిక అంత్యక్రియలను కోడెల కుటుంబ సభ్యులు తిరస్కరించారు. కేసులు పెట్టి అవమానాలకు గురిచేశారని మండిపడ్డారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు అవసరం లేదని తేల్చి చెప్పారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details