అనంతపురం జిల్లా గుంతకల్లులో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని, రైల్వే జంక్షన్లో సిద్ధంగా ఉంచిన ప్రత్యేక ఐసోలేషన్ కోచ్లను కలెక్టర్ పరిశీలించారు. కరోనా నేపథ్యంలో అత్యవసర సమయంలో ఉపయోగించడానికి సాధరాణ రైలు బోగీలను ఐసోలేషన్ వార్డులుగా మార్చారు. 50 బోగీలను గుంతకల్లు డీఆర్ఎం ఆలోక్ తివారి, వైద్య సిబ్బందితో కలిసి.. కలెక్టర్ గంధం చంద్రుడు పరిశీలించారు. కరోనాపై పోరాటంలో రైల్వే శాఖ అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఐసోలేషన్ బోగీలు.. అన్ని వసతులతో సిద్ధమయ్యాయన్నారు.