ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అలర్లు చేసేది వారు... ఆరోపణలు మా పైనా?'

వైకాపా నేతలు ప్రతిసారి వాళ్లదే అధికారం అంటారు. కానీ మా లెక్కలు మాకు ఉన్నాయి. తెదేపా విజయం సాధిస్తుంది. చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు: చినరాజప్ప

By

Published : Apr 18, 2019, 4:35 PM IST

చినరాజప్ప

చినరాజప్ప

రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నది వైకాపా నేతలేనని హోం మంత్రి చినరాజప్ప విమర్శించారు. వారే అల్లర్లు స్పష్టించి... ఏపీలో శాంతిభద్రతలు బాగోలేదంటూ విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కడపలో ప్రతిపక్ష నేత కుటుంబ సభ్యుల చేతిలోనే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారని ఆరోపించారు. స్పీకర్ కోడెల మీద ఎలా దాడి చేశారో అంతా చూశారన్నారు. ఎన్నికల నిర్వహణలో అల్లర్లను అదుపు చేయడంలో ఎన్నికల సంఘం ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. ముఖ్యమంత్రి సమీక్షలపైనా విమర్శలు చేయడమేంటని దుయ్యబట్టారు. ప్రజాసమస్యలు ఎవరు పరిష్కారిస్తారని ప్రశ్నించారు. తెదేపా ప్రవేశ పెట్టిన సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని చినరాజప్ప ధీమా వ్యక్తం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details