ఎన్నికల ప్రచారంలో సభాపతి కోడెల శివ ప్రసాదరావు శాసన సభాపతి డాక్టర్ కోడెల శివ ప్రసాదరావు గుంటూరు జిల్లా రాజుపాలెం మండలంలోని పలు గ్రామాల్లో విస్తృత ప్రచారం చేశారు. గణపవరం, రెడ్డిగూడెం, బ్రాహ్మణపల్లి, ఇనిమెట్లతదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓటు వజ్రాయుధం లాంటిదని...ఏ నాయకుడైతే సుపరిపాలన అందిస్తారో వారిని ఎన్నుకునేందుకు ప్రజలు మందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర పురోగతి రెట్టింపు అవుతుందని అన్నారు. భవిష్యత్తులో చంద్రబాబు మరిన్ని సంక్షేమ పథకాలు తీసుకువస్తారని కోడెల తెలిపారు