ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కొత్త కోర్సుల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్'

ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో కొత్త కోర్సులకు నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీట్ల పెంపునకూ సాంకేతిక విద్యాశాఖ ఆమోదం తెలిపింది.

By

Published : Jul 26, 2019, 8:59 PM IST

కొత్త కోర్సుల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్

రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో కొత్త కోర్సులకు నిర్వహణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) అనుమతి మేరకు నూతన కోర్సుల నిర్వహణకు అనుమతులు మంజూరు చేసింది. సాంకేతిక విద్యాశాఖ ఇంజనీరింగ్, ఫార్మసీ వృత్తివిద్యా కళాశాలల్లో సంప్రదాయ కోర్సులతో పాటు ఆధునిక కోర్సులకు అనుమతులు మంజూరు చేసింది. పవర్ ఎలక్ట్రానిక్స్, వీఎల్ఎస్ఐ సిస్టం డిజైన్స్, సిగ్నల్ ప్రోసెసింగ్, హైడ్రాలిక్స్, జియో టెక్నికల్ ఇంజనీరింగ్, పవర్ సిస్టమ్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, సాయిల్ మెకానిక్స్, బయో ఇన్ఫర్మాటిక్స్, కంప్యూటర్ నెట్​వర్క్ వంటి నూతన కోర్సుల నిర్వహణకు అనుమతి ఇచ్చింది. ఈ కోర్సుల్లో ప్రవేశానికి సీట్ల పెంపునకూ సాంకేతిక విద్యాశాఖ ఆమోదం తెలిపింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details