ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాత్రి అయినా.. కొనసాగుతున్న పోలింగ్

పోలింగ్​ సమయం ముగిసినా పలు జిల్లాల్లో.. ఇంకా పోలింగ్​ జరుగుతోంది. ఈవీఎంలు సరిగా పని చేయకపోవటం.. వాటి స్థానంలో కొత్తవాటిని అమర్చటంతో పోలింగ్​ ఆలస్యమైంది. 6గంటలలోపు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించడంతో ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. కడప, గుంటూరు, నెల్లూరు, విజయనగరం, జిల్లాలో రాత్రి అయిన పోలింగ్ కొనసాగుతుంది.

By

Published : Apr 11, 2019, 9:16 PM IST

Updated : Apr 11, 2019, 9:45 PM IST

రాత్రి అయినా కొనసాగుతున్న పోలింగ్

రాత్రి అయినా కొనసాగుతున్న పోలింగ్

కడప, నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, విజయనగరం, కృష్ణా జిల్లాలోని పలు నియోజక వర్గాల్లో ఈవీఎంలు మెురాయించటంతో ఇంకా పోలింగ్​ కొనసాగుతోంది. ఉదయం నుంచి ఈవీఎంలు సరిగా పని చేయకపోవటంతో పోలింగ్​కు అంతరాయం ఏర్పడింది. అయితే అధికారులు.. వాటి స్థానంలో కొత్తవాటిని అమర్చారు. పలు ప్రాంతాల్లో ఉదయం ఓటు వేయకుండా తిరిగి వెళ్లిన వారందరూ సాయంత్రం ఒక్కసారిగా పోలింగ్​ కేంద్రాలకు వచ్చారు. క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించడంతో ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం కొత్త ఈవీఎంలను అధికారులు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు భారీగా బారులు తీరారు.

రాష్ట్రవ్యాప్తంగా 400 పోలింగ్ కేంద్రాల్లో ఇంకా పోలింగ్​ కొనసాగుతోంది. అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Last Updated : Apr 11, 2019, 9:45 PM IST

ABOUT THE AUTHOR

...view details