రైతులు మార్కెటింగ్ శాఖ ద్వారా జొన్న, మొక్కజొన్న, అపరాలను అమ్ముకోవాలని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సూచించారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం కాజీపేటలో ఆయన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు, బయట మార్కెట్ ధరకు 500 నుంచి 600 రూపాయాల వరకూ వ్యత్యాసం ఉంటుందని తెలిపారు. బయట ఎవరూ అమ్మవద్దని కొనుగోలు కేంద్రాల్లోనే పంట అమ్ముకోవాలని కోరారు.
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
లాక్డౌన్ నేపథ్యంలో రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తెలిపారు. అన్నదాతలు ఈ అవకాశం వినియోగించుకోవాలని కోరారు.
' కొనుగోలు కేంద్రాల్లోనే మొక్కజొన్న విక్రయం'