ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

న్యాయమూర్తులకు అమరావతి రైతుల వందనం.. న్యాయం చేయాలంటూ వేడుకోలు

అమరావతి రైతుల పిటిషన్​పై మంగళవారం హైకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో భారీ ఎత్తున రైతులు నిరసన చేపట్టారు. మానవహారంగా ఏర్పడి న్యాయమూర్తులు వెళ్లే సమయంలో వారికి నమస్కారం పెట్టి నిరసన తెలిపారు.

By

Published : Aug 4, 2020, 1:31 PM IST

amravathi protest against three capitals
అమరావతి రైతుల నిరసన

మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ..అమరావతి సీడ్ యాక్సిస్ రహదారిపై రైతులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. తాళ్లాయపాలెం నుంచి నేలపాడు వరకు భౌతికదూరం పాటిస్తూ మానవహారంగా ఏర్పడ్డారు. జాతీయ జెండాలు పట్టుకుని నిరసన తెలిపారు. ఇవాళ హైకోర్టులో విచారణ ఉన్నందున.. న్యాయమూర్తులు వెళ్లే సమయంలో నమస్కారం పెట్టి నిరసన తెలిపారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన తమకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details