ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

173వ రోజుకు చేరిన అమరావతి రైతుల దీక్షలు

రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించలంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న దీక్షలు 173వ రోజుకు చేరుకున్నాయి. కరోనా విజృంభిస్తున్న వేళ నిబంధనలు పాటిస్తూనే.. ఇంటి వద్ద దీక్షలు చేస్తున్నారు.. రైతులు.

By

Published : Jun 7, 2020, 4:22 PM IST

amaravathi protest reached to 173 days
173వ రోజుకు చేరుకున్న అమరావతి రైతుల దీక్షలు

అమరావతి రైతుల దీక్షలు 173వ రోజుకు చేరుకున్నాయి. అమరావతిలోనే పూర్తి స్థాయి రాజధానిని నిర్మించాలంటూ అన్నదాతలు డిమాండ్ చేశారు. తుళ్లూరు మండలం రాయపూడి, తుళ్లూరు, దొండపాడు, అనంతవరం, మందడం గ్రామాల్లో రైతులు, మహిళలు ఇంటి వద్దే దీక్షలు చేపట్టారు.

కోవిడ్ -19 నిబంధనలు పాటిస్తూనే తమ ఇళ్ల వద్దే.. ధర్నాలో పాల్గొన్నారు. రైతుల మనోభావాలను ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించాలన్నారు. రాజధానిపై సత్వర నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కౌలు డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details