ఆంధ్రప్రదేశ్

andhra pradesh

న్యాయం జరిగే వరకు పోరాడతాం: అమరావతి రైతులు

By

Published : Dec 3, 2020, 5:22 PM IST

అమరావేతినే రాజధానిగా కొనసాగించాలంటూ.. రాజధాని గ్రామాల్లో 352వ రోజు నిరసనలు కొనసాగాయి. న్యాయం జరిగే వరకు పోరాడతామని రైతులు స్పష్టం చేశారు.

amaravathi-farmers-protest-aganist-govt
amaravathi-farmers-protest-aganist-govt

మందడం, తుళ్లూరు, వెలగపూడితోపాటు అనంతవరం, కృష్ణాయపాలెం ధర్నా శిబిరాల్లో అమరావతి నినాదాలు మారుమోగాయి. రాజధాని కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం భూములు ఇచ్చిన తమకు అన్యాయం జరిగిందని.. మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తమ జీవితాలతో చెలగాటమాడుతుందని రైతులు, మహిళలు ధ్వజమెత్తారు. ఎన్ని రోజులైనా తమకు న్యాయం జరిగే వరకు క్షేత్రస్థాయిలో పోరాడతామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజలు అమరావతి ఉద్యమానికి సంఘీభావం తెలపాలని రైతులు, మహిళలు కోరారు.

ABOUT THE AUTHOR

...view details