రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారికి అశ్రు నయనాల మధ్య అంత్యక్రియలు
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కుర్నూతల వద్ద జరిగిన ప్రమాదంలో మృతి చెందిన ఆరుగురి మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం స్వగ్రామానికి తరలించారు. మృతదేహాల వద్ద కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఒకేసారి ఆరు మృతదేహాలను వాహనాలపై ఉంచి అశ్రునయనాల మధ్య అంత్యక్రియల క్రతువు నిర్వహించారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఓ శుభకార్యానికి హాజరై తిరిగి వస్తుండగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఒకే కుటుంబంలో ఆరుగురి మృతదేహాలకు అంత్యక్రియలు