ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 3, 2020, 4:41 PM IST

ETV Bharat / state

'సీఎం జగన్ గారూ... ఫ్యాక్టరీని ఆపి మాట నిలబెట్టుకోండి'

తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం కొత్త పాకలలో దివీస్ ఫార్మా పరిశ్రమను నెలకొల్పే ఆలోచనను విరమించుకోకపోతే పోరుబాట పడతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు హెచ్చరించారు. పరిశ్రమ ఏర్పాటును అడ్డుకుంటామని గతంలో ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకోవాలని ఆయన కోరారు.

cpm madhu
cpm madhu

తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం కొత్త పాకలలో దివీస్ ఫార్మా పరిశ్రమను నెలకొల్పే ఆలోచనను విరమించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దివీస్ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా గురువారం తాటియాకులపాలెంలో సీపీఎం ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు.

దివీస్ పరిశ్రమ ఏర్పాటును అడ్డుకుంటామని గతంలో ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకోవాలని మధు కోరారు. లేదంటే కలెక్టరేట్ ముట్టడితో పాటు నిర్మాణ పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు. అలాగే కాకినాడ ఎస్​ఈజెడ్​ను రద్దు చేసి రైతుల భూమిని తిరిగి ఇచ్చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సభకు రైతు సంఘాల నాయకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details