కోనసీమ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు ఆరంభం తూర్పుగోదావరి జిల్లాలో గౌతమీ నది తీరాన ఉన్న కోనసీమ తిరుపతి వాడపల్లి వెంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి మూలవిరాట్ విగ్రహాలకు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, అగ్ని ప్రతిష్టాపన, విశేష అర్చన, నీరాజనము వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణం మొత్తం వివిధ రకాల ప్రత్యేక పూలతో అందంగా ముస్తాబుచేశారు. స్వామివారిని దర్శించుకోడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వాడపల్లి తరలివస్తున్నారు.
ఇదీ చదవండి :