ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్యాయత్నం...భార్య మృతి !

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆనందంగా జీవితాన్ని గడుపుదామని ఇల్లు అద్దెకు తీసుకొని కాపురం పెట్టారు. కానీ.. విధి వారి కలల్ని కూల్చేసింది. ఆర్థిక ఇబ్బందులకు తోడు...కుటుంబసభ్యులు పట్టించుకోకపోవటంతో మనస్థాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ విషాదకర ఘటన తూర్పుగోదావరి జిల్లా పేరవరంలో చోటు చేసుకుంది.

By

Published : Feb 1, 2020, 11:37 PM IST

ఆర్థికఇబ్బందులతో దంపతుల ఆత్మహత్యాయత్నం
ఆర్థికఇబ్బందులతో దంపతుల ఆత్మహత్యాయత్నం

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం పేరవరంలో విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు భరించలేక భార్యాభర్తలు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. ఘటనలో భార్య మృతి చెందగా..భర్త చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. గ్రామానికి చెందిన కోట దుర్గాప్రసాద్, శివాణిలు 18 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం రాజవరంలో ఇల్లుకు అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడం, కుటుంబ సభ్యులు పట్టించకోకపోవటంతో జీవితంపై విరక్తి చెంది పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికులు గమనించి రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించగా..చికిత్స పొందుతూ శివాని మృతి చెందింది. కాగా ఆమె భర్త పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details