ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 28, 2021, 10:12 PM IST

ETV Bharat / state

'నిబంధనల ప్రకారం వ్యవహరిస్తే కులాలు ఆపాదిస్తున్నారు'

ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు పదవులు కట్టబెడుతూ.. ఎస్​ఈసీకి కులాలు ఆపాదించడం ఎంతవరకు సమంజసం అని తెదేపా నేత బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం నడుచుకుంటున్న నిమ్మగడ్డను.. చంద్రబాబు మనిషి అని సంబోధించడాన్ని తప్పుబట్టారు.

tdp leader buchiah chowdary fires on government
ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన తెదేపా నేత బుచ్చయ్య చౌదరి

ఎన్నికల నిర్వహణలో పూర్తి అధికారాలు ఎస్ఈసీకే ఉన్నాయని.. ప్రభుత్వం ఇష్టారీతిగా వ్యవహరిస్తే కుదరదని తెదేపా సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి అన్నారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నిబంధనల ప్రకారం వ్యవహరిస్తే.. చంద్రబాబు మనిషి అని ముద్ర వేయడం సరికాదన్నారు.

నిమ్మగడ్డను కోర్టు గతంలో మందలించినపుడు ఆయన ప్రభుత్వం మనిషి అని.. ఇప్పుడు కులాలు అంటగడుతున్నారని బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు పదవులు కట్టబెడుతూ.. మిగతా వారికి కులాలు ఆపాదించడం ఏంటని ప్రశ్నించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details