కరోనా వచ్చిన వాళ్లను వైకాపా ప్రభుత్వం గాలికి వదిలేసిందని తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు, ఆక్సిజన్ లాంటి సౌకర్యాలు లేక రోగులు నరకం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా తెదేపా ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ వరకు అన్ని నియోజకవర్గాల్లోనూ నిరసనలు చేపడతామని బొండా ఉమా వెల్లడించారు.
'కరోనా బాధితులను ప్రభుత్వం గాలికి వదిలేసింది'
కరోనా సమస్యల పరిష్కారం కోసం తెలుగుదేశం పార్టీ వివిధ దశల్లో ఉద్యమం చేపట్టనున్నట్లు తెదేపా నేతలు తెలిపారు. కరోనా బాధితులను వైకాపా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
తెదేపా నేతలు
కరోనా సమస్యల పరిష్కారం కోసం తెలుగుదేశం పార్టీ వివిధ దశల్లో ఉద్యమం చేపట్టనున్నట్లు మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. కరోనా వైరస్ విజృంభణకి వైకాపా ప్రభుత్వమే కారణమని చినరాజప్ప అన్నారు.
ఇదీ చదవండి: ఎస్ఈసీగా నిమ్మగడ్డను నియమించాలంటూ సీఎస్కు గవర్నర్ ఆదేశం