ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 27, 2020, 1:35 PM IST

Updated : Jun 27, 2020, 2:30 PM IST

ETV Bharat / state

తన స్థలంపై 'గవర్నమెంట్' అని రాశారని.. యజమాని ఆత్మహత్యాయత్నం

రెవెన్యూ అధికారులు తన స్థలాన్ని స్వాధీనం చేసుకొంటారనే భయంతో తూర్పుగోదావరి జిల్లా ధర్మవరంలో గోపి అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

sucide attempt person at dharmavaram east godavari district
స్థలాన్ని స్వాధీనం చేసుకొంటారనే భయంతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

స్థలాన్ని స్వాధీనం చేసుకొంటారనే భయంతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో గోపీ అనే యువకుడు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఇళ్ల స్థలాల సేకరణలో భాగంగా, రెవెన్యూ అధికారులు గతంలో ఇచ్చిన ఇండ్ల స్థలాలపై గవర్నమెంట్ అని రాయటంతో హనుమంతు కాలనీ వాసులు ఆందోళనకు గురయ్యారు.

అధికారులు స్థల సేకరణలో భాగంగా తన స్థలాన్ని స్వాధీనం చేసుకుంటారనే భయంతో గోపీ పురుగుల మందు తాగాడు. అతనిని ప్రత్తిపాడు ఆస్పత్రికి తీసుకెళ్లగా... పరిస్థితి విషమించగా కాకినాడకు తరలించారు.

Last Updated : Jun 27, 2020, 2:30 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details