ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 19, 2020, 5:02 PM IST

ETV Bharat / state

దివాన్ చెరువులో సేవ ఉగాది సంస్థ ఉదారత

లాక్​డౌన్ నేపథ్యంలో నిరుపేదలకు పలువురు ఆపన్నహస్తాన్ని అందిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్ చెరువులోని పారిశుద్ధ్య కార్మికులకు పంచాయతీ కార్యదర్శి సత్తిరాజు నిత్యావసర సరకులు అందజేశారు.

seva ugadhi agency supplied essential supplies to sanitation workers in diwan cheruvu
దివాన్ చెరువులో సేవ ఉగాది సంస్థ ఉదారత

కరోనా కట్టడిలో ముఖ్య పాత్ర పోషిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు దాతలు సహాయం చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్ చెరువులోని పారిశుద్ధ్య కార్మికులకు పంచాయతీ కార్యదర్శి సత్తిరాజు.. సేవ ఉగాది సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులను అందజేశారు. ప్రతిరోజు వందలాది బాటసారులకు భోజనం ప్యాకెట్లు పంపిణీని సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. శ్రీ మహాగణపతి యువజన సేవా సమితి ఆధ్వర్యంలో పేదలకు కిరాణా సరుకులను పంపిణీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details