ధవలేశ్వరం దిగువకు వదిలే వరదనీరు కోనసీమలోని 72లంక గ్రామాల మీదుగా ప్రవహించి సముద్రంలోకి చేరుతుంది. ఈ క్రమంలో రామచంద్రాపురం, ముమ్మడివరం నియోజకవర్గానికి చెందిన సుమారు ఎనిమిది మండలాల్లో 75వేల ఎకరాల్లో లంక భూమి విస్తరించి ఉంది. ఇక్కడి ప్రజలు కొబ్బరి, బొప్పాయి, ఇతర కూరగాయలు సాగు చేస్తున్నారు. నది ప్రవాహానికి కోతలు ఏర్పడి ఎంతో విలువైన భూములు పాడవటం వల్ల ప్రజలు ఉపాధి కోల్పోతున్నారు.
లంక గ్రామాలను కాపాడేందుకు అధికారుల చర్యలు
వర్షాల కారణంగా రాజమండ్రిలోని కొన్ని లంక గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. దీంతో పంటపొలాల సాగు సైతం దెబ్బతింటుంది. లంక కోతల నివారణ కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టినా ఫలితం శూన్యం.
ముమ్మడివరంలో రివర్ట్మెంట్ పనులు
ప్రస్తుతానికి లంక గ్రామాలను కాపాడేందుకు రివెట్మెంట్ పనులు జరుగుతున్నాయి. ఈ పనులన్నీ వేసవిలో జరగాల్సి ఉండగా...ఎన్నికల కారణంగా వాయిదా పడ్డాయి. రివెట్మెంట్ పనుల కోసం ప్రభుత్వం 17కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఇప్పటికైనా నీటి ప్రవాహానికి ఎక్కువ కాలంపాటు నిలిచేలా అడ్డుకట్ట వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఇది చూడండి: "రవిశేఖర్ ఆచూకీ తెలిపిన వారికి లక్ష రూపాయలు"