తూర్పు గోదావరి జిల్లాలో చౌక దుకాణాల ద్వారా ఉచిత రేషన్ సరకుల పంపిణీ ప్రహసనంగా మారింది. చౌక దుకాణాలకు నూరు శాతం బియ్యం సరఫరా కాకపోవడం, కందిపప్పు అవసరం మేరకు అందుబాటులో లేకపోవడం, సరకుల పంపిణీ గడువు ముగియకుండానే 11వ తేదీ నుంచి ఈ-పోస్ యంత్రాల్లో కార్యకలాపాలు నిలిపివేయడం వల్ల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గత నెల 29వ తేదీ నుంచి జిల్లాలోని 2,600 చౌక దుకాణాల ద్వారా ఉచితంగా బియ్యం, కందిపప్పు పంపిణీని ప్రారంభించారు. బియ్యం పొందిన వారందరికీ కందిపప్పు పంపిణీ చేయలేదు. కందిపప్పు చౌక దుకాణాలకు చేరేసరికి ఈ - పోస్ యంత్రాలు మనుగడలో లేకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తాయి.
కందిపప్పు పంపిణీ లేదు