తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో రేషన్ డీలర్లు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. 8 వ విడత రేషన్ పంపిణీని నిలుపుదల చేశారు.
దుకాణాల్లో వేలిముద్రలను వేసే ప్రక్రియ, కాటా అనుసంధానం తీసేయాలన్నారు. కమీషన్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దుకాణాలు మూసివేశారు. రావులపాలెం తహసీల్దార్ కు తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.