తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గంలోని నగరం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఖాళీ స్థలంలో ఓఎన్జీసీ, గెయిల్ సంస్థలు మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పాలని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు విజ్ఞప్తి చేశారు. కరోనా సమయంలో ఈ రెండు సంస్థలు ముందుకు వచ్చి ఆక్సిజన్ ప్లాంట్ నెలకొల్పాలని లేఖ రాశారు.
నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆస్పత్రులలో ఆక్సిజన్ బెడ్డు ఏర్పాటు చేయాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి ధర్మాన కృష్ణదాస్ను ఎమ్మెల్యే కోరారు. అత్యవసర అంబులెన్స్ సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.