ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 17, 2021, 6:17 PM IST

ETV Bharat / state

ఓన్జీసీ, గెయిల్ సంస్థలకు ఎమ్మెల్యే లేఖ.. ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పాలని వినతి

తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గంలోని నగరం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఖాళీ స్థలంలో ఓఎన్జీసీ, గెయిల్ సంస్థలు మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పాలని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆ సంస్థలకు లేఖ రాశారు.

corona cases at p. gannavaram
corona cases at p. gannavaram

తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గంలోని నగరం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఖాళీ స్థలంలో ఓఎన్జీసీ, గెయిల్ సంస్థలు మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పాలని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు విజ్ఞప్తి చేశారు. కరోనా సమయంలో ఈ రెండు సంస్థలు ముందుకు వచ్చి ఆక్సిజన్ ప్లాంట్ నెలకొల్పాలని లేఖ రాశారు.

నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆస్పత్రులలో ఆక్సిజన్ బెడ్డు ఏర్పాటు చేయాలని జిల్లా ఇన్​ఛార్జి మంత్రి ధర్మాన కృష్ణదాస్​ను ఎమ్మెల్యే కోరారు. అత్యవసర అంబులెన్స్ సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details