ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 10, 2020, 10:07 PM IST

ETV Bharat / state

అమరావతి కోసం అంతా ఒక్కటై పోరాడాలి: తెదేపా

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో మూడు రాజధానుల అంశంపై తెదేపా నేతలు బహిరంగ సభ నిర్వహించారు. సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు హాజరయ్యారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన సాగుతుందని విమర్శించారు. 6 నెలల్లోనే అందరితో ఛీదరించుకునేలా పాలన ఉందన్నారు. అందరూ ఒకే తాటిపైకి వచ్చి అమరావతికోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ చౌదరి, మాజీ ఎమ్మెల్యో బండారు సత్యానందరావు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, అమరావతి పరిరక్షణ కమిటీ సభ్యలు పాల్గొన్నారు.

open meeting in east godavari dst about 3capital issue
మూడు రాజధానుల అంశంపై జరిగిన బహిరంగ సభ

మూడు రాజధానుల అంశంపై రావులపాలెంలో బహిరంగ సభ

ఇదీ చూడండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details