ఆలయ అధికారులు చెప్పిన ప్రకారం.. ఈ సంవత్సరం జరిగే అమ్మ వారి తీర్థ మహోత్సవానికి సుమారు 10 లక్షల భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రాంగణమంతా చలువ పందిళ్లు, విద్యుద్దీపాలతో అలంకరించారు. నేటి రాత్రి జరిగే అమ్మవారి జాగరణకు అన్ని వసతులు సమకూర్చారు. శుక్రవారం తీర్థ మహోత్సవం, 6న ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు.
నూకాలమ్మా... మమ్ము చల్లంగా చూడమ్మా!!
చిన్నారులను కాపాడే దేవతగా... చింతలు తీర్చే తల్లిగా... భక్తుల పాలిట కల్పవల్లిగా పూజలందుకుంటున్న నూకాలమ్మ జాతర మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా చింతలూరులో ఉన్న ఈ ఆలయ ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
నూకాలమ్మా... మమ్ము చల్లంగా చూడమ్మా!!
ఇదీ చదవండి....'అన్నవరం దేవస్థానం ఈవోగా సురేష్ బాబు'