తెలుగుదేశం సీనియర్ నేత అశోక్ గజపతిరాజును జైలుకు పంపుతామని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించడం.. తనకు బాధ కలిగించిందని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. సీఎం జగన్కు రాసిన లేఖలో తన బాధను వ్యక్తం చేశారు.
Mudragada letter to CM: ఎంపీ విజయసాయి మాటలు.. బాధ కలిగించాయి: ముద్రగడ
ముఖ్యమంత్రి జగన్కి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. అశోక్ గజపతిరాజును ఎంపీ విజయసాయి జైలుకు పంపుతామనటం బాధాకరమని లేఖలో పేర్కొన్నారు. అశోక్ గజపతిరాజు గౌరవనీయమైన వ్యక్తి అని వివరించారు. గౌరవనీయులను అగౌరవపరచవద్దని వైకాపా నాయకులను ఆదేశించాలని కోరారు.
mudhragada letter to cm jagan
అశోక్ గజపతిరాజు వంశీకులు వేల ఎకరాలు దానం చేశారని.. అటువంటి గౌరవనీయులపై వైకాపా నేతలెవరూ అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఆదేశించాలని.. జగన్ను ముద్రగడ కోరారు. మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ ఎవరినీ అగౌరవపరిచే వ్యక్తి కాదని లేఖలో ప్రస్తావించారు.
ఇదీ చదవండి: