కరోనా కారణంగా తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంలో తరలించిన కూరగాయల మార్కెట్ ను ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పరిశీలించారు. తాము నిర్వహించుకుంటున్న ప్రదేశాల నుంచి మార్కెట్ను వేరే ప్రాంతానికి తరలించడం కారణంగా ఇబ్బంది పడుతున్నామని కూరగాయల వ్యాపారులు ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. పాత ప్రదేశాల వద్దే కూరగాయల దుకాణాలు పెట్టుకునేందుకు సహకరించాలని ఎమ్మెల్యేను కోరారు. పోలీసులతో మాట్లాడి చర్యలు తీసుకుంటానని చిట్టిబాబు బదులిచ్చారు.
పి.గన్నవరం మార్కెట్ను పరిశీలించిన ఎమ్మెల్యే
లాక్ డౌన్ క్రమంలో కూరగాయల మార్కెట్లను అధికారులు విశాలంగా ఉండే ప్రాంతాలకు మార్చారు. తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరంలో కూరగాయల మార్కెట్ ను ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పరిశీలించారు. మార్కెట్లోనే కూరగాయలు అమ్ముకునేలా చర్యలు చేపట్టాలంటూ కూరగాయల వ్యాపారులు ఆయనను కోరారు.
పి గన్నవరం మార్కెట్ను పరిశీలించిన ఎమ్మెల్యే