ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఫిబ్రవరిలోగా అంతర్వేది రథాన్ని నిర్మిస్తాం: మంత్రి వెల్లంపల్లి

By

Published : Sep 14, 2020, 3:49 PM IST

అంతర్వేది దేవస్థానంలో కొత్త రథాన్ని వచ్చే ఫిబ్రవరిలోగా నిర్మిస్తామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. స్వామి వారి కల్యాణోత్సవాలకు ముందే రథం సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

మంత్రి వెల్లంపల్లి
మంత్రి వెల్లంపల్లి

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో దగ్ధమైన రథం స్థానంలో కొత్త రథాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా నిర్మిస్తామని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. స్వామివారి కల్యాణోత్సవాలకు ముందే రథం సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.

రథం ఆకృతిలో ఎలాంటి మార్పులు లేకుండా పూర్వ నిర్మాణంలోనే నిర్మిస్తామని మంత్రి తెలిపారు. కొత్త రథం నిర్మాణానికి రూ.95 లక్షలు ఖర్చవుతుందన్న అంచనా వేశామన్నారు.

ఇదీ చదవండి :పార్టీ నుంచి బహిష్కరించినట్టే! : ఎంపీ రఘురామకృష్ణరాజు

ABOUT THE AUTHOR

...view details