ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 7, 2020, 4:42 PM IST

ETV Bharat / state

సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి విశ్వరూప్​

దిశ చట్టం మహిళలకు రక్షణగా నిలుస్తుందని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్ వ్యాఖ్యానించారు. శనివారం రాజమహేంద్రవరంలో దిశ పోలీసు స్టేషన్​ను సీఎం జగన్ ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.

పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి పినిపే
పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి పినిపే

సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి పినిపే

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రేపు సీఎం జగన్ పర్యటించనున్నారు. పట్టణంలో దిశ పోలీసు స్టేషన్​ను ఆయన ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ఏర్పాట్లను పరిశీలించారు. ఎస్పీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్​ను సందర్శించారు. ఏర్పాట్లు వివరాలను తెలుసుకొని అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి... దిశ చట్టం మహిళలకు ఎంతో రక్షణగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details