తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం గొల్లలమెట్ట వీధిలో విషాదం జరిగింది. బంటుపల్లి సత్యవేణి (46) మేడపైన పువ్వులు కోస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడింది. అదే సమయంలో పిట్టగోడ కూలి ఆమెపై పడింది.
ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన సత్యవేణి అక్కడికక్కడే మృతి చెందింది. ప్రస్తుతం మృతురాలి భర్త దుబాయ్లో ఉన్నాడు. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.