ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మృతదేహంతో ధర్నాకు దిగిన కార్మికులు

తూర్పుగోదావరి జిల్లాలోని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా చేపట్టారు. జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన కాళ్ల ఏసు...చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాదం జరిగినా అధికారులు స్పందించటం లేదని మృతదేహంతో కుటుంబసభ్యలు, తోటి కార్మికులు ధర్నా నిర్వహించారు.

By

Published : Aug 22, 2019, 10:35 AM IST

మృతదేహంతో కార్మికులు ధర్నా

మృతదేహంతో కార్మికులు ధర్నా

తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా చేపట్టారు. జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాళ్ళ ఏసు(35) అనే వ్యక్తిపై నుండి లారీ దూసుకుపోయింది. తీవ్రంగా గాయపడిన ఏసును కుటుంబసభ్యులు కాకినాడ ఆసుపత్రికి తరలించగా...చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాదం జరిగినా ఇప్పటివరకు అధికారులు స్పందించకపోవడంతో...అధికారులు, తోటి కార్మికులు మృతదేహంతో ధర్నాకు దిగారు. కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details