ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 24, 2020, 4:49 PM IST

ETV Bharat / state

నిరుపేదలు, నిరాశ్రయులకు వ్యాపారవేత్త అన్నదానం

లాక్​డౌన్ వలన అన్నం దొరక్క అవస్థలు పడుతున్న నిరుపేదలు, నిరాశ్రయులకు గోపాలపురంలో అన్నదానం చేశారు. గుజరాత్​లో వ్యాపారవేత్త అయిన గ్రామానికి చెందిన మాదే ప్రసాద్​రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

food distribution to poor in gopalapuram
నిరుపేదలకు గోపాలపురంలో అన్నదానం

లాక్​డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేదలు, నిరాశ్రయులకు ప్రతి ఒక్కరూ తమ వంతు సాయం అందిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం గోపాలపురంలోని ఆకుల రామకృష్ణ కళ్యాణ మండపంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వ్యాపారరీత్యా గుజరాత్​లో స్థిరపడిన గ్రామానికి చెందిన నవదీప్ షిప్పింగ్ లిమిటెడ్ అధినేత మాదే ప్రసాద్​రావు తన తండ్రి నాగేశ్వరరావు జ్ఞాపకార్థం 400మంది నిరుపేదలకు అన్నదానం చేశారు.

ABOUT THE AUTHOR

...view details