ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 20, 2021, 9:48 AM IST

ETV Bharat / state

Reddy Subramanyam: "రాజకీయాల్లో ఎందుకు ఉన్నామా అనిపిస్తోంది"

రాష్ట్రంలో జరిగిన సంఘటనలు చాలా బాధాకరమని.. శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు.రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని.. ఈ దాడులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని మండిపడ్డారు. తెదేపా నేతల ఇళ్లపై దాడులు చూస్తుంటే రాజకీయాల్లో ఎందుకు ఉన్నామా అనేంతలా బాధేస్తోందని ఆవేదన చెందారు.

ex Deputy Chairman of the Legislature reddy subramanyam fires on ycp over attacks on tdp leaders houses
రాష్ట్రంలో దాడులు రాజకీయాల్లో ఎందుకు ఉన్నామని అనిపిస్తోంది: రెడ్డి సుబ్రహ్మణ్యం


"రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది.. ఈ దాడులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి" అని శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. రాష్ట్రంలో జరిగిన దాడులు చాలా బాధాకరమన్న ఆయన.. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలపై ఏనాడూ దాడులు చేయలేదని గుర్తుచేశారు.

తెదేపా నేతల ఇళ్లపై మూక దాడులు చేస్తుంటే.. రాజకీయాల్లో ఎందుకు ఉన్నామా అనేంతగా బాధ కలుగుతోందని ఆవేదన చెందారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. సరైన సమయంలో ఓటు అనే ఆయుధం ద్వారా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ విషయంపై గవర్నర్ స్పందించి తగిన నిర్ణయం తీసుకోవాలని రెడ్డి సుబ్రహ్మణ్యం కోరారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details