తూర్పు గోదావరి జిల్లాలో నిన్న ఒక్కరోజే ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావటంపై అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. ఇప్పటి వరకూ జిల్లాలో తొమ్మిది పాజిటివ్ కేసులు బయటపడడ్డాయి. దిల్లీ వెళ్లొచ్చిన వారిని కలిసిన వారికీ కరోనా వైరస్ సోకడం జిల్లా వాసులను ఆందోళనకు గురి చేస్తోంది. రాజమహేంద్రవరానికి చెందిన 72 ఏళ్ల వృద్ధుడు దిల్లీ నుంచి వచ్చిన అనంతరం కొత్తపేటలో నివాసం ఉంటున్న అతని కుమారుడు, కోడలు, మనవడు, మనమరాలు కలిశారు. వీరిలో కరోనా బాధితుడి కోడలు, మనవడు, మనవరాలుకు కరోనా సోకింది.
కాకినాడకు చెందిన వ్యక్తి దిల్లీ వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత ప్రత్తిపాడు మండలం, పిఠాపురం, కాకినాడలో సంచరించాడు. అతడిని కలిసిన పిఠాపురానికి చెందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థికి కరోనా సోకింది. ఆ విద్యార్థి మరికొంతమంది యువకులతో కలిసి క్రికెట్ ఆడినట్లు అధికారులు సమాచారం సేకరించారు. కాకినాడలోనూ బిర్యాని అమ్ముకునే మరో వ్యక్తికీ కొవిడ్-19 సోకింది. అతను దిల్లీ వెళ్లోచ్చిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగినట్లు అధికారులు చెప్తున్నారు. వారికి సన్నిహితంగా ఉన్న మరి కొంతమందిని క్వారంటైన్కు తరలిస్తున్నారు. రాజమహేంద్రవరం నుంచి 26, కాకినాడ నుంచి 10 మంది దిల్లీ వెళ్లొచ్చినట్లు అధికారులు గుర్తించారు.
కొత్తపేటలో రెడ్జోన్