ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 12, 2020, 2:50 PM IST

ETV Bharat / state

కోనసీమలో కరోనా కేసుల విజృంభణ

తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. 16 మండలాల్లో 305 మందికి కరోనా సోకగా.. మొత్తం ఐదుగురు చనిపోయారు.

corona cases increasing in konaseema
కోనసీమలో కరోనా కేసుల విజృంభణ

తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతాన్ని కరోనా వణికిస్తోంది. మార్చి 31 నుంచి ఈనెల 11 వరకు కోనసీమ ప్రాంతంలోని 16 మండలాల్లో 305 మందికి కరోనా సోకింది. మొత్తం ఐదుగురు చనిపోయారు. అయినవిల్లి మండలంలో 74 పాజిటివ్ కేసులు ఉన్నాయి.

మిగిలిన 231 కేసులు 15 మండలాల్లో నమోదయ్యాయి. కంటైన్​మెంట్ జోన్లలో ఉన్న దుకాణాలను మూయించి వేస్తున్నారు. కేసులు పెరుగుతున్న కారణంగా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అమలాపురం డివిజన్ అడిషనల్ డీఎంహెచ్​వో డాక్టర్. సిహెచ్ పుష్కర రావు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details