ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 1, 2020, 1:23 PM IST

ETV Bharat / state

పి.గన్నవరంలో మరో 8 కరోనా కేసులు

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలంలో కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. తాజా మరో 8 కేసులు నమోదు కావటంతో మెుత్తం కేసుల సంఖ్య 84కు చేరింది.

పి.గన్నవరంలో మరో 8 కరోనా కేసులు
పి.గన్నవరంలో మరో 8 కరోనా కేసులు

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలంలో తాజాగా 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మండలంలో కేసుల సంఖ్య 84కి పెరిగింది. కొత్తగా నమోదైన ఎనిమిది కేసుల్లో పి.గన్నవరం 2 ,ముంగండ 2, కే ముంజవరం 2 వాడ్రేవుపల్లి 1 మండేపులంకలో 1 చొప్పున కేసులు నమోదయినట్లు నాగుల్ లంక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి కే సుబ్బరాజు వెల్లడించారు. వైరస్ విజృంభణ దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రజలు భౌతికదూరం పాటిస్తూ...వ్యక్తిగత శుభ్రతకు ప్రాధాన్యతనివ్వాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details