సీఐటీయూ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల నిరసన
తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. లాక్డౌన్ కారణంగా మూడు నెలలుగా పనులు లేకుండా పోయాయని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు నిరసన చేపట్టారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని భవన నిర్మాణ కార్మికులను డిమాండ్ చేశారు. ఇసుక కొరత తీర్చి, సిమెంట్, ఇనుము ధరలకు తగ్గించాలని నినాదాలు చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చాక 8 నెలలుగా ఇసుక కొరతతో పనులు లేవని..., ఆ తర్వాత లాక్డౌన్ కారణంగా పనులు లేకుండా పోయాయని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజ్కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ బోర్డు నుంచి చెల్లించాల్సిన బకాయిలు 4 కోట్ల వరకూ ఉన్నాయని, వీటిని చెల్లించే విషయంలో చొరవ చూపాలని కోరారు.
ఇదీచదవండి:ట్రాక్టర్ ఢీ... తల్లి, 28 రోజుల పసికందు దుర్మరణం
TAGGED:
CITU protest at kakinada