ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సచివాలయ ఉద్యోగాల్లో ప్రలోభాలకు లొంగొద్దు: కలెక్టర్

సచివాలయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఎలాంటి ప్రలోభాలకు గురికావొద్దని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి సూచించారు. పూర్తి పారదర్శకంగా రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే ఉద్యోగ నియామకాలు జరుగుతాయని వెల్లడించారు.

By

Published : Aug 26, 2019, 3:16 PM IST

సచివాలయ ఉద్యోగాలు పూర్తిపారదర్శకంగా జరుగుతాయి

సచివాలయ ఉద్యోగాలు పూర్తిపారదర్శకంగా జరుగుతాయి

సచివాలయ ఉద్యోగాల కోసం తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 481 పరీక్ష కేంద్రాల్లో 2లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాయబోతున్నట్లు కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. పరీక్ష నిర్వహణ ఏర్పాట్లు పూర్తి కావచ్చాయని తెలిపారు. సెప్టెంబర్ ఒకటో తేదీ ఉదయం జరిగే పరీక్షకు అత్యధికంగా లక్ష 25వేల మంది హాజరుకానున్నట్లు వెల్లడించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144సెక్షన్ అమల్లో ఉంటుందని, అభ్యర్థుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు..

ABOUT THE AUTHOR

...view details