తూర్పు గోదావరి జిల్లా అంకంపాలెంలో హల్ చల్ చేసిన చిరుతపులి.. అటవీ అధికారుల వేసిన వలలో పడకుండా తప్పించుకుంది. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని భయాందోళనకు గురవుతున్నారు.
By
Published : Feb 5, 2019, 5:30 PM IST
escape
chitaa
కొబ్బరి చెట్టు ఎక్కిన చిరుత.. పక్కనే ఉన్న పంట పోలాల్లోకి వెళ్లిపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. అటవీ అధికారులు, పోలీస్ సిబ్బంది పంటపొలాలు, గ్రామాల్లో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు.