తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జగన్ పాలనను చంద్రబాబు ఎద్దేవా చేశారు. అధికార పార్టీ పనితీరును విమర్శిస్తూ... తెదేపా ఎప్పుడూ క్యాడర్ను గౌరవిస్తుందన్నారు. జగన్ కక్షపూరిత రాజకీయాలకు శ్రీకారం చుట్టారని ఆరోపించారు. జగన్ ఇవాళ కూడా కోర్టుకు వెళ్లే పరిస్థితి ఉందన్నారు. జిల్లాలో మా వాళ్లపై 21అక్రమ కేసులు పెట్టారని.. పోలీసులకు ఇంత అత్యుత్సాహం పనికిరాదని అన్నారు. పోలవరం నిర్మాణ పనులు ఆగిపోతే ఉభయగోదావరి జిల్లా ప్రజల పరిస్థితి ఎంటి? జగన్ 100 రోజుల పాలన ప్రజలకు శాపంగా మారిందని అన్నారు. ప్రశాంతంగా ఉండే గోదావరి ప్రజలను రెచ్చగొడుతున్నారని చంద్రబాబు అన్నారు.
'కక్ష తీర్చుకునేందుకేనా..ప్రజలు మీకు ఓటేసింది..!'
కక్ష తీర్చుకునేందుకేనా ప్రజలు మీకు ఓటు వేసిందని ప్రతిపక్షనేత చంద్రబాబు విమర్శించారు. 40ఏళ్ల చరిత్రలో ఇంతటి రాక్షస పాలన ఎప్పుడూ చూడలేదని బాబు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగిన మీడియా సమావేశంలో జగన్ పాలనను ఎత్తి చూపారు.
జగన్ పాలనపై చంద్రబాబు ఫైర్