ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 20, 2020, 11:31 PM IST

ETV Bharat / state

వివాహం కోసం.. వాగు దాటిన యువతి

ఇటీవల కురిసిన వర్షాలకు తూర్పుగోదావరి జిల్లాలో కొండవాగులు పొంగుతున్నాయి. మారేడుమిల్లి మండలంలో పుల్లంగి గ్రామానికి చెందిన ఓ గిరిజన యువతి వివాహానికి సమీప బోధలూరు వెళ్లేందుకు బయలుదేరగా.. మార్గమధ్యంలో వాగు పొంగింది. దీంతో పెళ్లి కూతురును యువకులు వాగు దాటించారు.

పెళ్లి చేసుకునేందుకు వాగు దాటిన గిరిజన యువతి
పెళ్లి చేసుకునేందుకు వాగు దాటిన గిరిజన యువతి

తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం పుల్లంగి గ్రామానికి చెందిన పూసర్ల ప్రమోహన అనే గిరిజన యువతికి బోదులూరు గ్రామానికి చెందిన గొర్లె ఉదయంతో వివాహం కుదిరింది.

వధువు పుల్లంగి గ్రామం నుంచి బోదులూరుకు కారులో బయలుదేరింది. దారిలో కొండవాగు ఉద్ధృతంగా ప్రవహించగా.. స్థానికులు భుజాలపై ఎత్తుకుని ఆమెను వాగు దాటించారు. అనంతరం బోదలూరులో వారి వివాహం జరిగింది.

ABOUT THE AUTHOR

...view details