ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాష్ట్రంలో 20 లక్షల సభ్యత్వ నమోదే భాజపా లక్ష్యం'

ప్రపంచంలోనే ఎక్కువ మంది కార్యకర్తలు కలిగిన ఏకైక పార్టీ భాజపా అని మాజీ మంత్రి మాణిక్యాలరావు అన్నారు. రాజమహేంద్రవరం 36వ డివిజన్​లో ఆ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

By

Published : Jul 12, 2019, 5:24 PM IST

'రాష్ట్రంలో 20 లక్షల సభ్యత్వ నమోదే భాజపా లక్ష్యం'

రాజమహేంద్రవరంలోని 36వ డివిజన్​లో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మాణిక్యాలరావు పాల్గొన్నారు. ప్రపంచంలోనే ఎక్కువ మంది కార్యకర్తలు కలిగిన పార్టీ భాజపా అని అన్నారు. రాష్ట్రంలో సుమారు 20 లక్షల మందిని సభ్యులుగా నమోదు చేయించాలనే లక్ష్యంతో ఉన్నామని తెలిపారు. ఆర్ధిక, సామాజిక అసమానతలు లేని పరిస్థితి సృష్టించేందుకు కృషి చేస్తున్న ప్రధాని నరేంద్రమోదీని... అందరూ స్వాగతిస్తూ భాజపాలో చేరుతున్నారన్నారని మాజీ మంత్రి స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు హుందాగా సాగాలని మాణిక్యాలరావు కోరారు.

'రాష్ట్రంలో 20 లక్షల సభ్యత్వ నమోదే భాజపా లక్ష్యం'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details